రాష్ట్రంలో వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని కేంద్ర మాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని అన్నారు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ నాయకులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు, ఏజెంట్ల నియామకాలపై చర్చించారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లా డుతూ ఒక్క చాన్స్ పేరుతో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్ర వనరులను దోపిడీ చేశారని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయా ల్సిన వైసీపీ ప్రభుత్వమే అరాచకాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా ప్రజ లను దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో ఎంతో మేలు జరుగు తుందని ప్రజలు భావించారన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇవ్వడం ఖాయమన్నారు. మళ్లీ చంద్ర బాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేలిపోయిందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో టీడీపీకి చెందిన ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమా వేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు, ఓబులాపురం శేషి రెడ్డి, లక్ష్మీనారాయణ యాదవ్, చిట్యాల మద్దయ్య గౌడు, మండల పార్టీ అధ్య క్షుడు శ్రీనివాసులు యాదవ్, కమలాపురం సర్పంచ్ రేగటి అర్జున్ రెడ్డి, భాస్కర్ నాయుడు, మర్రి చక్రపాణి, ఎస్ఎండీ రపీ, ఆలేబాదు పరమేష్, ఎస్టీ హరూన్, సుధాకర్ రెడ్డి, గొవిందరెడ్డి, బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa