ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెలవుపై వెళ్తోన్న సీఎస్‌ జవహర్‌రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 03:58 PM

ఏపీలో ఎన్నికల అనంతరం ఆసక్తికర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ్టి సాయంత్రానికి రాష్ట్రంలో కొత్త చీఫ్ సెక్రటరీని నియమించనున్నట్టు సమాచారం.నిన్న చంద్రబాబుతో భేటీ అయిన ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి... అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్తున్నట్టు తెలిపారు. GAD పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్‌ను ఇప్పటికే లీవ్ కోరారు సీఎస్‌. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లగానే గవర్నర్ కొత్త సీఎస్‌ను నియమించే అవకాశాలున్నాయి. మరోవైపు ఇప్పటికీ రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa