ఆంధ్రప్రదేశ్లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం దిగిపోయి కొత్తగా టీడీపీ సర్కారు ఏర్పాటుకానున్న నేపథ్యంలో.. నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వైసీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడి పదవికి కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. 2024 ఏపీ ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. చంద్రగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేశారు. అయితే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేతిలో మోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అలాగే వైసీపీ అధికారం కోల్పోయింది. దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తుడా ఛైర్మన్ పదవికి, టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మరోవైపు చంద్రగిరిలో ఓటమిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పందించారు. గత ఐదేళ్లుగా ప్రజల కోసం ఎంతో కష్టపడినట్లు మోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వందల కోట్లను ఖర్చు చేసి చంద్రగిరి నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కల్పించామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇంత చేసినా కూడా.. ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల్లో ఫలితాలు చూశాక బాధ వేసిందని అన్నారు. అయితే ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి శుభాకాంక్షలు తెలియజేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. ప్రజల కోసం పనిచేయాలని కోరారు. తుడా ఛైర్మన్ పదవిని ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
మరోవైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ తరుఫున పోటీచేసి గెలుపొందారు. అయితే ఈసారి ఎంపీగా పోటీచేసిన భాస్కర్ రెడ్డి.. తన స్థానంలో తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బరిలో నిలిపారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం చంద్రగిరి ఓటర్లు టీడీపీ అభ్యర్థి వైపు మొగ్గుచూపారు. దీంతో పులివర్తి నాని ఏకంగా 43వేల ఓట్లకుపైగా మెజారిటీతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద విజయం సాధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa