దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించారు. 16రోజులకు గాను రూ.3,23,75, 523లు సమకూరింది. సగటున రోజుకు రూ.20,23,470లు కానుకల రూపంలో రాగా రికార్డు స్థాయిలో రోజువారీ హుండీ ఆదాయం పెరిగినట్టు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. బంగారం 694 గ్రాములు, వెండి 6కిలోల 264 గ్రాములు వచ్చాయి. 516 యూఎస్ డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, 1000 కొరియా ఓన్లు, 40 ఇంగ్లండ్ పౌండ్లు, 100 ఓమన్ బైన్సాలు, 17 కెనడా డాలర్లు, 25 యూఏఈ దీర్హమ్స్, ఒక కువైట్ దినార్, 24 ఖతార్ రియాల్స్, 2 సింగపూర్ డాలర్లు సమకూరాయి. ఆన్లైన్ ఈ హుండీ ద్వారా రూ.59,380లు ఆదాయం వచ్చింది. ఈవో రామారావు, దేవదాయశాఖ అధికారులు, వన్టౌన్ పోలీస్ సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa