మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు చంద్రబాబు సర్కార్ షాకిచ్చింది. ఆయనకు సంబంధించి షాపింగ్మాల్ను నిబంధనలకు పూర్తి విరుద్ధమంటున్నారు అధికారులు. జీవీఎంసీ 70వ వార్డు పరిధి గాజువాక సమీప చట్టివానిపాలెం దగ్గర నేషనల్ హైవేకుఆనుకుని అమర్నాథ్ ఐదంతస్థుల భవనం నిర్మించారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే షాపింగ్మాల్ నిర్మించారని గుర్తించారు. ఏపీసీ స్వయంగా అమర్ ఇంటికి వెళ్లి ఈ భవనంపై నోటీసులు అందించారు. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని.. లేని పక్షంలో ఉద్దేశపూర్వక నేరంగా పరిగణించబడుతుందని నోటీసుల్లో హెచ్చరించారు.
జీవీఎంసీ పరిధిలోని 70వ వార్డులో చట్టివానిపాలెం దగ్గర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు సర్వే నెంబరు 79/7ఏలో సుమారు 447.33 చదరపు గజాల స్థలం ఉంది. 2021 ఫిబ్రవరి 9న రూ.10వేలు చెల్లించి ప్లాన్కు దరఖాస్తు చేశారు.. ఎల్టీపీ లాగిన్లో ఉంచాక ఎంత ఫీజులు చెల్లించాలో చూపించినప్పటికీ పన్నులు చెల్లించకపోవడంతో ఆ దరఖాస్తు అక్కడే ఆగిపోయింది. 46 చదరపు గజాల గిఫ్ట్డీడ్ కూడా జీవీఎంసీకి చేయలేదని చెబుతున్నారు. జీవీఎంసీ అనుమతుల్లేకుండానే అక్కడ జి+4 షాపింగ్ మాల్ నిర్మించారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఈ భవనంలోనే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. గతేడాది నవంబరు, డిసెంబరులో అనుమతుల్లేని ఈ నిర్మాణంపై జోన్-6 నుంచి రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. కానీ భవన నిర్మాణం పూర్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa