కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. బుధవారం నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో టీడీపీ నాయకుడు మారిశెట్టి సూరిస్వామి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అభయాంజనేయ స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమి విజయం ప్రజా విజయమని ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలంతా సంతోషంగా జీవిస్తారని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెలగన సూర్యారావు, పంచదార దుర్గాప్రసాద్ పలువురు నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa