అధికారం శాశ్వతం కాదని, అభివృద్ధే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో సోమవారం ఎంపీపీ వాన గోపి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోని సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో పనులు గాలికొదిలేయడంతో శివారు ప్రాంతాలకు సాగునీరందలేదన్నారు. ఈ ఏడాది ఖరీఫ్కు శివారు ప్రాంతాల భూములకు సాగునీరందించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు వంశధార అధికారులకు సూచనలు చేశారన్నారు. ఇప్పటికే రైతులకు ఎరువులు, విత్తనాలు అందించినట్లు అధికారులు చెప్పడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మెండ విజయశాంతి, తహసీల్దార్ నాగలక్ష్మి, ఇన్చార్జి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రమణమూర్తిని పలువురు ప్రజాప్రతినిధులు, మండల అధికారులు సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa