ప్రజలకు మంచి రోజులు వచ్చాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బుడ్డా తన సతీమణి శైలజతో కలిసి గురువారం మహానందీశ్వరుడిని దర్శించుకున్నారు. వీరికి ఆలయం ముఖద్వారం వద్ద ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక అభిషేకార్చన పూజలను జరిపారు. ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో వేదపండితులు ఆశీర్వదించి ప్రసాదాలు అందచేశారు. ఈవో వీరిని శాలువా సన్మానించి, స్వామివారి మెమెంటో బహూకరించారు. ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు రాక్షసపాలన నుంచి విముక్తి కలిగిందని అన్నారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకే నియోజిక వర్గంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. అనంతరం దేవస్ధానం ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే దంపతులను శాలువాతో సన్మానించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామలింగారెడ్డి, ఎంపీపీ యశస్వీనిరెడ్డి, గాజుల పల్లి ఆర్ఎస్ సర్పంచ్ అస్లాం బాషా, పార్టీ మండల మధు, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, నాగపుల్లయ్య, సుబ్రమణ్యం, మల్లికార్జునరావు, మౌళీశ్వరరెడ్డి, జనార్దన్రెడ్డి, క్రాంతికుమార్, చిన్న రంగస్వామి, మహేష్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa