రానున్న రోజుల్లో నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో ఇంటర్తోపాటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. రాజానగరం హైస్కూల్లోని విద్యార్థులకు ప్రభుత్వం నుంచి విడుదలైన స్టూడెంట్స్ కిట్లను బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువులను మధ్యలోనే మాన్పించకుండా తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎంపీపీఎస్ రాజానగరం నెంబర్-1, 2 పాఠశాలలు, సూర్యారావుపేట, తూర్పుగోనగూడెం, కలవచర్ల పాఠశా లల్లో స్థానిక కూటమి నాయకులు స్టూడెంట్ కిట్స్ అందజేశారు. కార్యక్ర మాల్లో ఎంఈవోలు రామన్నదొర, జ్యోతి ప్రసాద్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa