ఇటలీ పోలీసుల చొరవతో అక్కడ బానిసత్వ పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తోన్న 33 మంది భారతీయ వలసకార్మికులు విముక్తి లభించింది. ఉత్తర వెరోనా ప్రావిన్స్లో 33 మంది భారతీయ వ్యవసాయ కార్మికులను బానిసల వంటి పని పరిస్థితుల నుంచి విముక్తి కల్గించినట్టు ఇటలీ పోలీసులు శనివారం వెల్లడించారు. వారిని బానిసల్లా చూస్తున్న ఇద్దరు యజమానులను అరెస్ట్ చేసి.. దాదాపు అర మిలియన్ యూరోలు (545,300 డాలర్లు) స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. జూన్లో జరిగిన ప్రమాదంలో ఇటలీలో కార్మికుల దోపిడీ వెలుగులోకి వచ్చింది. మెషీన్లోని పండ్ల తోటల్లో పనిచేసే భారతీయుడు చేయి తెగిపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ కేసులో భారత్కు చెందిన దళారులు, గ్యాంగ్ మాస్టర్లు ఉన్నట్టు పోలీసులు ఆరోపించారు. సీజనల్ వర్క్ పర్మిట్లపై ఇటలీకి తీసుకొచ్చి ఒక్కొక్కరి నుంచి 17,000 యూరోలు వసూలు చేసిన దుండుగులు.. వారికి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారని పోలీసులు తెలిపారు. తీరా వారికి వ్యవసాయ క్షేత్రాల్లోని ఉద్యోగాల్లో చేర్చించారని చెప్పారు. ‘వారానికి ఏడు రోజులు రోజుకు 10-12 గంటలు పనిచేయించుకుని.. గంటకు కేవలం 4 యూరోలు మాత్రమే చెల్లిస్తున్నారు.. వారికి ఇచ్చిన అప్పు తీరే వరకు బానిసలు మాదిరిగా ఊడిగం చేయించుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
(పర్మినెంట్ వర్క్ పర్మిట్ కోసం అదనంగా 13,000 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది.. జీతం లేకుండా పనిచేస్తే ఉచితంగా ఇప్పిస్తామని నమ్మబలికారు... వాస్తవానికి ఎప్పటికీ ఆ పర్మిట్ రాదు’ అని పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు. నిందితులు బానిసత్వం, శ్రమ దోపిడీకి సంబంధించిన నేరాలకు పాల్పడ్డారని, బాధితులకు రక్షణ, పని అవకాశాలు, చట్టపరమైన రెసిడెన్సీ పత్రాలు అందజేయనున్నామని పోలీసులు తెలిపారు.
కాగా, ఇతర ఐరోపా దేశాల మాదిరిగానే ఇటలీ కూడా వలసల ద్వారా ప్రత్యేకించి తక్కువ-చెల్లింపు ఉద్యోగాలలో మానవ వనరుల కొరత ఎదుర్కొంటోంది. వలసదారుల వర్క్ వీసా వ్యవస్థ కార్మికుల కొరతను పెంచుతోంది. కార్మిక చట్టాల ఉల్లంఘనలతో ఈ సమస్య ఉత్పనమవుతోంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఇస్టాట్ 2021 డేటా ప్రకారం.. దాదాపు 11% ఇటాలియన్ కార్మికులు చట్టవిరుద్ధంగా ఉపాధి పొందారు. వ్యవసాయ రంగంలో ఈ వాటా 23% కంటే ఎక్కువగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa