‘నీ గురించి నాకు అంతా తెలుసు. నీ కథ చూస్తా..’ అంటూ తాడిపత్రి మున్సిపల్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై రెచ్చిపోయిన న్యాయవాది శ్రీనివాస్.. అనూహ్యంగా బుధవారం ఆయన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ సమయంలో ప్రజల సమస్యలు వింటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. శ్రీనివాస్ను చూడగానే అసహనం వ్యక్తం చేశారు. ‘కాదనుకుని వెళ్లావు కదా..? మళ్లీ ఎందుకొచ్చావ్..? ఎన్నికల ముందు బయటకు వెళ్లి అనరాని మాటలు అన్నావు. వెన్నుపోటు పొడిచేవారు ఎవరూ మాకు వద్దు. వెళ్లిపో..’ అని సూచించారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా శ్రీనివాస్ అక్కడే నిలబడ్డాడు. ‘నేను ప్రజల సమస్యలను వినాలి. నీవు ఎంతసేపు ఉన్నా ప్రయోజనం లేదు. వెళ్లిపోవచ్చు..’ అని ప్రభాకర్ రెడ్డి ఎంత చెప్పినా వినలేదు. దీంతో అక్కడున్న కార్యకర్తలను పిలిచి న్యాయవాదిని ఇంటి బయట విడిచిపెట్టాలని సూచించారు. ఇద్దరు కార్యకర్తలు న్యాయవాది శ్రీనివాస్ను భుజాలపై ఎత్తుకుని ఇంటి బయట వదిలిపెట్టారు. అయినా ఆయన కదలకుండా.. ఇంటి ఆవరణలోనే నిలబడ్డారు. కాసేపటి తరువాత పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు జేసీ ప్రభాకర్రెడ్డి రాయలచెరువుకు వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa