తెనాలి పట్టణం ఐతానగర్కు చెందిన తాడిబోయిన శ్రీనివాసరావు, జయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు రవితేజ (28) ఎంఎస్ చేయడానికి గతేడాది అమెరికా వెళ్లారు. అక్కడే టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలోని ఓ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. రెండో కుమారుడు అజయ్ తేజ ప్రస్తుతం బీటెక్ పూర్తి చేశాడు. ఇండియాలోనే అతడు ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాడు. కాగా, తండ్రి శ్రీనివాసరావు ఏడేళ్ల కిందట అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి చనపోయిన నాటి నుంచి తల్లి జయలక్ష్మి వ్యవసాయ కూలీగా మారి కుటుంబాన్ని పోషిస్తుంది. అమెరికాలో పై చదువులు చదువుకుని మంచి స్థాయికి చేరాలన్న ఆలోచనతో బ్యాంక్ లోన్ తీసుకొని రవితేజను అక్కడకు పంపారు. అయితే ఈ నెల 18న స్థానికంగా ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్కు రవితేజ, అతడి స్నేహితుడితో పాటు వెళ్లాడు. అక్కడ ఒక పూల్ 4 అడుగుల లోతు, మరొకటి 8 అడుగుల లోతు ఉన్న క్రమంలో ఇద్దరూ అధిక లోతు ఉన్న పూల్లో ప్రమాదవశాత్తు జారిపడ్డారు.
ఈ ఘటనలో రవితేజ స్నేహితుడు బయటకు వచ్చాడు కానీ.. అతడు మాత్రం నీటిలో మునిగిపోయాడు. ఈత రాకపోవటంతో జల సమాధి అయిపోయాడు. పోలీసులు ద్వారా విషయాన్ని తెలుసుకున్న అక్కడి బంధువులు తెనాలిలోని కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. బంధువులతో పాటు తానా సభ్యులు మృతదేహాన్ని స్వస్థలం తెనాలికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమారుడి మరణవార్త తెలిసి తల్లి జయలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డ మృతదేహాన్ని త్వరగా తన వద్దకు చేర్చండయ్యా..అంటూ ఆమె గుండెలవిసేలా రోధిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa