గురుపౌర్ణమి వేడుకలను మదనపల్లె పట్టణంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బర్మావీధిలోని షిర్డీసాయిబాబా ఆలయంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు నాదేళ్ల బాబు నాయుడు దంపతులు హోమం నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అలాగే బైపాస్రోడ్డులోని దక్షిణాషిర్డిసాయిబాబాకు గురుపౌర్ణమి సందర్భంగా ఆలయకమిటీ సభ్యులు విశేషపూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొ ని బాబాను దర్శించుకున్నారు. వరాల ఆంజేయస్వామి ఆలయంలో ఆలయకమిటీ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకులు నిర్వహించారు. ఉద యాన్నే స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు తోపాటు విశే షపూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అమ్మ చెరువు మిట్ట గంగమ్మ గుడి సమీపంలోని సాయిబాబా ఆలయం లో ఆలయకమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో విశేషపూజలు నిర్వ హించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అనప గుట్టలోని శ్రీకృష్ణాఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయం నుంచి గిరిప్రథక్షిణ చేశారు. మధ్యాహ్నం భక్తుల కు అన్నదానం చేశారు. ఈశ్వరమ్మ కాలనీ పెంచుపాడు రోడ్డులో మద నపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా వాల్మీకి సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. గురుపౌర్ణమి సందర్భంగా బాలు, పూలకుంట్ల హరిబాబు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa