పట్టపగలు నడిరోడ్డు మీద వైసీపీ కార్యకర్తలను, నేతలను చంపేస్తుంటే మంత్రి లోకేశ్ తిరిగి వైసీపీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల హత్యలపై మాట్లాడకుండా.. చనిపోయిన వారితో పాటు చంపింది కూడా వైసీపీ వాళ్లేనని అబద్ధాలతో దాడి చేస్తున్నారని విమర్శించారు.ఏ పార్టీ వాళ్లైనా సరే హత్యలను ఎలా సమర్థిస్తారని నిలదీశారు.తుపాకీ పట్టుకోవాలంటూ స్వయంగా ఏపీ హోంమంత్రి అనిత సూచించడం దేనికి సంకేతమని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa