ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు రుణాలను తక్షణమే మాఫీ చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 08:37 PM

తెలంగాణ తరహాలో రెండు లక్షల వరకూ రుణమాఫీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కడప  స్థానిక ఎద్దుల ఈశ్వరరెడ్డి హాల్‌లో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాటా ్లడారు. రుణమాఫీ చేస్తామని 2014్టలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రూ. 50 వేల వరకూ మూడు దశలుగా రుణాలను మాఫీ చేయడంతో పాటు 50 వేలకు పైగా రుణాలకు బాండ్లు ఇవ్వగా, 2019 ఎన్నికల్లో జగనరెడ్డి అధికారంలోకి వచ్చాడ న్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన నాలుగో విడత, ఐదో విడత బాండ్లను జగనరెడ్డి ప్రభుత్వం పట్టించుకోనందున రైతులు అప్పుల పాల య్యారన్నారు. కాగా, ప్రస్తుతం చంద్రబాబు ముఖ్య మంత్రి అయ్యారు కాబట్టి నాలుగో విడత, ఐదో విడతలో మిగిలిపోయిన బ్యాంకు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని కోరారు. తెలంగాణ తరహాలో రెండు లక్షల వరకూ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 29, 30, 31 తేదీల్లో మదన పల్లెలో ఆంధ్రప్రదేశ రైతు సంఘం రాష్ట్ర స్థాయి సమ్మే ళనాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమ్మేళనాలలో రైతులు, కౌలు రైతులు, పాడి రైతులు, ఉద్యాన రైతుల సమస్యలపై చర్చిస్తామ న్నారు. ఈ సమ్మేళనాలకు 26 జిల్లాల నుంచి ప్రతినిథులు హాజరుకానున్నా రన్నారు. సమావేవంలో ఏపీ రైతు సంఘం జిల్లా గౌరవాఽధ్యక్షు డు గాలి చంద్ర, అధ్యక్షుడు సుబ్బారెడ్డి, కార్యదర్వి భాస్కర్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa