ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. కూటమి పక్ష నేతలు, కార్యకర్తలు ఓ హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా తప్పులు చేస్తే.. అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అన్నారు. చివరికి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలైనా సరే.. తప్పు చేస్తే వారిని వదులుకోవడానికి కూడా తాను వెనుకాడనని తెగేసి చెప్పారు. ఎవరు తప్పు చేసినా తాము శిక్ష వేస్తామనే సంకేతం ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. చంద్రబాబు అనుభవం ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని.. అందుకు తాము తప్పనిసరిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అటు.. గత వైసీపీ పాలనపై కూడా నిప్పులు చెరిగారు. పంచాయితీలకు కేంద్రం సకాలంలో నిధులిచ్చినా.. గత ప్రభుత్వం వాటిని బదలాయించలేదని ఆరోపించారు. నిధుల బదలాయింపులో జరిగిన అవకతవకలపై కమిషన్ వేస్తామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa