ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, వైసీపీల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మె్ల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్టేటివ్ అసెంబ్లీ అని మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదంటూ ఆదివారం వైసీపీని విమర్శించారు వైఎస్ షర్మిల. వైఎస్ జగన్కు, వైసీపీకి అసెంబ్లీకి వెళ్లేంత ధైర్యం లేదని.. పిరికితనమని, అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేశారు. అయితే దీనికి వైసీపీ కూడా అదే రేంజులో రియాక్టయ్యింది. తెలంగాణ నుంచి పారిపోయి ఏపీకి వచ్చింది మీది పిరికితనమా.. మాదా అంటూ కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవుతున్నారని., ఆయనకు కొమ్ముకాస్తున్నారని, ప్రతిపక్షాన్ని ప్రతిపక్షమే ప్రశ్నిస్తుందా అంటూ వైఎస్ షర్మిలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా అంటూ ప్రశ్నించారు. మీ మూర్ఖత్వానికి, మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలని.. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే అంటూ ఎద్దేవా చేశారు. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని.. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నారంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
"సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది. కానీ మాకు ద్వేషం లేదు. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అనేది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు! కాబట్టే తప్పు అన్నాం! చట్ట సభను గౌరవించకపోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నాం!" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
టీడీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చే్స్తే నేనే వచ్చి ధర్నా చేస్తానని చెప్పానన్న షర్మిల.. వైసీపీ హయాంలో ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే వైఎస్ఆర్కు అవమానం జరిగి ఉండేది కాదని అన్నారు. వైఎస్సార్సీపీ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎప్పుడో వెళ్లగొట్టారన్న షర్మిల.. ఇప్పుడు Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారని ట్వీట్ చేశారు. వైసీపీలో వైఎస్ఆర్ను, విజయమ్మను అవమానించినవారే పెద్దోళ్లంటూ విమర్శించారు,
మరోవైపు వైఎస్ఆర్లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదని.. మీకు మీడియా పాయింటే ఎక్కువ అంటూ వైసీపీపై షర్మిల సెటైర్లు వేశారు.వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకుని.. బీజేపీతో సంబంధం పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టుపెట్టారని.. మీ అహంకారమే మీ పతనానికి కారణమంటూ వైఎస్ షర్మిల సుధీర్ఘమైన ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa