దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మిని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసినట్టుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. విజయమ్మను జేసీ కలవడానికి కారణమేంటి?.. రాజకీయన పరమైన అంశాలు ఏమన్నాయ ఉన్నాయా? వీరి కలయికతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుందా?.. అంటూ అనే ప్రశ్నలు కూడా జోరుగా నడిచాయి. అయితే ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీయడంపై జేసీ స్పందించారు. అసలు విజయమ్మ కలవడానికి కారణం ఏంటో ఎక్స్ వేదికగా తెలియజేశారు.ఈరోజు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు వెళ్లగా.. అక్కడ విజయమ్మ కనిపించారని, వెయిటింగ్ లాంజ్లో ఉన్న ఆమెను కలిసి పలకరించానని ఆయన స్పష్టం చేశారు. బాగోగులు అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. ఇందులో ఎలాంటి రాజకీయ పరిణామం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నేడు హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రి నందు చికిత్స కోసం వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డికి వెయిటింగ్ లాంజ్లో నందు వైఎస్ విజయమ్మ కనిపించడంతో ఆమె బాగోగుల గురించి పలకరించి మాట్లాడటం జరిగింది. ఈ కలయికలో ఎటువంటి రాజకీయ ప్రత్యేకత లేదు’’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ట్విట్టర్లో పోస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa