మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి రూ.22.5 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. మైలవరంలోని తన కార్యాలయంలో కూటమి నాయకులతో ఆయన సమావే శమయ్యారు. జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మం డలాలకు ఒక్కొక్కదానికి రూ.5 కోట్ల చొప్పున, విజయవాడ రూరల్ మండలానికి రూ.2.5 కోట్లు నిధులతో సీసీ డ్రెయినేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. మైలవరం, రెడ్డిగూడెం మండలానికి తన కార్యాలయ ప్రతినిధిగా రిటైర్డ్ డీఈ నాగమల్లేశ్వరరావును నియమించినట్లు తెలిపారు. సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు జన్మదినోత్సవం సందర్భంగా కేక్ను కట్చేశారు. నాగార్జునసాగర్ మూడో జోన్కు సాగర్ జలాల విడుదలకు కృషి చేస్తామన్నారు. కె.విజయ్ బాబు, ముప్పిడి నాగేశ్వరరెడ్డి, జానలపాటి వేణుగోపాల్ రెడ్డి, పాలంకి మోహనమురళీరెడ్డి, రామినేని వీరాస్వామి నాయుడు, అంజిరెడ్డి, కోటేశ్వర రావు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa