నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తామని, అందరూ సంయమనం పాటించాలని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయం లో నిర్వహించిన గ్రీవెన్స్లో ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం భ్రష్టు పట్టుకు పోయిందని, దానిని గాడిలో పెట్టి అన్ని శాఖలు, వ్యవస్థలను ఒక తాటిపైకి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారం వైపు పయనిస్తామ న్నారు. కార్యకర్తలెవరూ నిరాశ, నిస్పహలకు గురికావద్దన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టి నెల రోజులే అయిందని, దానిని మరిచి కొంతమంది పథకాలు అమలు విషయమై విమర్శలు చేస్తు న్నారని, అవేవీ పట్టించుకోవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా నలు మూలలనుంచి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa