మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి గత నవంబర్లో ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకుంది. షియోపూర్ జిల్లా విజయ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన 55 ఏళ్ల సీతారామ్ ఆదివాసి విజయం సాధించారు. కాంగ్రెస్ కీలకనేత రామ్నివాస్ రావత్పై గెలుపొందారు. ఎమ్మెల్యేగా సీతారామ్ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. గతంలో రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి చవిచూసిన సీతారామ్ మూడో పర్యాయంలో ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కించుకున్నారు.
అద్దె కట్టే స్థోమతలేక బీజేపీ ఎమ్మెల్యే తన భార్యతో కలిసి పూరి గుడిసెలోనే నివాసం ఉంటున్నారు. ఎమ్మెల్యే అయ్యి నెలన్నర దాటుతున్నా ఆయన ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటివరకూ తొలి జీతం అందుకోలేదు. అందులోనూ ఆయన నిరుపేద నేత. మా ఎమ్మెల్యే పూరి గుడిసెలో ఉండటం మాకు అవమానమని స్థానికులు భావించారు. చందాలు వేసుకుని ఆయనకు ఇల్లు కటిస్తున్నారు.
ఎన్నికలు వచ్చాయంటే నిరు పేదలకు ఇళ్లు కట్టిస్తామని, మీకు ఆదాయం సమకూరే మార్గాలు చూపిస్తామంటూ రాజకీయ నాయకులు ప్రచారం చేయడం చూస్తుంటాం. అయితే నియోజకవర్గ ప్రజలే చందాలు వేసుకుని మరీ వారి ఎమ్మెల్యేకు ఇల్లు కట్టిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa