ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతికి ముత్యాలమ్మ రూ. 50వేలు విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 29, 2019, 09:37 PM

అమరావతి నిర్మాణం కోసం రామగిరి మండలం, ఒంటిమద్ది గ్రామ పంచాయతీ, శ్రీహరిపురం గ్రామానికి చెందిన ముత్యాలమ్మ అనే వృద్ధ మహిళ రూ. 50వేలు విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. తనకొచ్చిన పెన్షన్ డబ్బులలో కొంత మిగిలించి దాచిన డబ్బును ఇవాళ సీఎంకు అందజేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ గ్రామానికి నీళ్లు ఇస్తే.. గుర్తుపెట్టుకుని అమరావతి నిర్మాణంలో తనకు కూడా బాధ్యత ఉందని చెబుతూ రూ. 50వేలు విరాళం ఇచ్చిందని కొనియాడారు. ఇలాంటి వాళ్లు ఉండడం మన అదృష్టమని, అందరిలో ఈ స్ఫూర్తి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మను చంద్రబాబు అభినందిస్తూ సభా వేదికగా ఆమె పాదాలకు నమస్కరించారు.  


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa