ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్ట‌కేల‌కు ఏపీ కి అద‌న‌పు కరవు సాయం రూ.900 కోట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 29, 2019, 09:40 PM

 గ‌త కొంత కాలంగా  అదనపు కరువు సాయం విడుదల చేయాలంటూ కోరుతున్న ఏపీ ప్ర‌భుత్వానికి ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌యాన్ని కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు   రూ. 900 కోట్ల జాతీయ విపత్తు నిధి కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర సాయం అందించాల‌ని నిర్ణ‌యించింది.  కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటున్న ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం ప్రకటించింది. అందులో ఏపీ కూడా ఉంది. అయితే ఈ నిధుల‌ను త్వ‌రిత‌గ‌తిన విడుద‌ల చేయించేలా కృషి చేయాల‌ని ఇప్ప‌టికే ఎంపీల‌కు చంద్ర‌బాబు ఆదేశాలిచ్చిన విష‌యం విదిత‌మే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa