ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక సమాధానాలకు ఓ ఉద్యోగి - స్పీకర్ కోడెల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 29, 2019, 08:55 PM

శాసనసభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి ప్రభుత్వంలోని ప్రతి శాఖలో ప్రత్యేక ఒక ఉద్యోగిని నియమించుకుంటే మంచిదని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు సూచించారు. శాసనసభా భవనం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాసనసభ అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ శాసనసభ సమావేశాలు విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది చాలా బాగా కృషి చేశారని వారందని అభినందించారు. కొత్త మంత్రులకు కూడా ఆయా శాఖల సిబ్బంది బాగా సహకరించారని ప్రశంసించారు. శాసనసభ సమావేశాలు ఈ నెల 30 నుంచి మొదలై ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. దాదాపు ఇవే 14వ శాసనసభ చివరి సమావేశాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు బాగా పని చేసిన్పటికీ చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదన్న భావన ఉందని చెప్పారు. అందువల్ల ప్రతి శాఖలో ఒక ఉద్యోగిని నియమించితే ఎక్కవ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ కోడెల అన్నారు. శాసన మండలి ఇన్‌ఛార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమావేశాలు సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన అధికారులకు, శాంతిభద్రతల విషయంలో పోలీసులు నిర్వహించిన పాత్రకు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పవలసిన అవసరం ఉందన్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలు రాలేదని చెప్పారు. పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. సభకు ప్రధాన ప్రతిపక్షాలు హాజరుకాకపోవడం సరైన విధానం కాదని, వారు కూడా వస్తే బాగుంటుందని సూచించారు. ప్రొటోకాల్ ఉల్లంగన జరుగకుండా శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్‌చంద్ర పునేఠ మాట్లాడుతూ అన్ని శాఖల వారు ప్రశ్నలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రొటోకాల్‌ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa