తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం 5 గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం భక్తులకు లభిస్తోంది. ఇక నిన్న స్వామివారిని 63,095 మంది భక్తులు దర్శించుకోగా, 23,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa