వెలగపూడి సచివాలయం జల వనరుల శాఖ చాంబర్ లో విలేకరుల సమావేశం లో మాట్లాడాను.కృష్ణ డెల్టా నీరు విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జల వనరుల శాఖ ఎస్. ఇ. ప్రసాద్ బాబును ఈఎన్సీ కి సరెండర్ చేయడం జరిగింది.20 సంవత్సరాల తర్వాత కృష్ణానది పై ఉన్న ప్రాజెక్టులన్ని జులై నెల నుంచి కళకళలాడుతున్నాయి.పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ద్వారా రాయలసీమకు మరియు నాగార్జునసాగర్ కుడి కాలువ, కృష్ణ డెల్టాకు త్రాగు సాగునీరు అందిస్తున్నాం.సాగునీటిని అందించేందుకు కలెక్టర్ పరివేక్షణలో ఇరిగేషన్, రెవిన్యూ, ఆర్డబ్ల్యూఎస్,పోలీస్ కమిటీగా ఏర్పడి సమన్వయంతో ఆఖరి రైతు వరకు నీరందించే బాధ్యత కలెక్టర్ తీసుకోవాలి.గత ఐదు సంవత్సరాల పాలనలో మెయింటెన్స్ లేక లాకులు మరమ్మత్తులు, కాలువలకు గండ్లు పడిన అత్యవసర పనులుగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa