ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఇటీవల చుక్కుల భూములపై ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సును ఆయన తిరస్కరించారు. 20 ఏళ్ల వరకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అమ్ముకోకుండా ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చింది.అయితే, సమస్య పరిష్కరించేలా ఆర్డినెన్స్ లేదని భావించిన గవర్నర్ ఆర్డినెన్స్ను తిప్పిపంపారు. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్కు గవర్నర్ నరసింహన్కు మధ్య మరోసారి వివాదం నెలకొంది. ఇక అంతే కాకుండా జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పును గవర్నర్ తప్పుపట్టారు. దరఖాస్తుకు కనీస పరిష్కార సమయం 2 నెలలు పెట్టడంపైనా గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, గవర్నర్ తిప్పిపంపడంతో మరోసారి ఆయనకు ఈ ఆర్డినెన్స్ పంపకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో నాలా ఆర్డినెన్సు విషయంలోనూ ఏపీ ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య ఇటువంటి వివాదమే తలెత్తింది. అయితే ఇప్పుడు అసైన్ మెంట్ ఆర్డినెన్స్ మాత్రం గవర్నర్ ఆమోదించారు. దీంతో చుక్కల భూముల బిల్లు విషయలో చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa