ఏపీలో దారుణం జరిగింది.. కదులుతున్న రైల్లో ఓ యువకుడు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఎదురు తిరిగిన యువతి.. తోటి ప్రయాణికులతో అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైల్లో ఓ విద్యార్థిని ప్రయాణిస్తోంది. ఆమె మంచి నిద్రలో ఉన్న సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చాడు.. యువతిని చూసి ఆ కామాంధుడు రెచ్చిపోయాడు. యువతి నిద్రిస్తుందని గమనించి.. ఆమెకు చాలా దగ్గరగా వెళ్లాడు.
యువతిని తాకడానికి అతడు ప్రయత్నించాడు.. యువతి నిద్రలేచి ఈ విషయాన్ని గమనించింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆ కామాంధుడికి ఎదురు తిరిగింది. తోటి ప్రయాణికులు సహాయంతో నిందితుడ్ని పట్టుకుంది.. ఆ తర్వాత స్టేషన్లో తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో రైల్వే పోలీసులకి అప్పగించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణాజిల్లా పామర్రులో ఓ టీచర్ బరి తెగించాడు.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి.. మనవరాలి వయసుండే ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు.. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బాలిక నిమ్మకూరు జెడ్పీ హైస్కూల్లో చదువుతోంది.. అదే స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజేశ్వరరావు ఈనెల 1న మధ్యాహ్నం సమయంలో నోట్ బుక్స్ పేరు చెప్పి విద్యార్థులను తన గదికి రమ్మని చెప్పాడు. ఆ బాలిక కూడా అక్కడికి వెళ్లింది.
నోట్ బుక్లో తప్పు ఉంది సరిచేయమని బాలికకు టీచర్ చెప్పాడు. ఆమె తప్పును సరి చేస్తుండగా.. విద్యార్థిని శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఈ నెల 5న రాత్రి పామర్రు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.. అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. అతడిపై గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. ఈ విషయం తెలియడంతో జిల్లా విద్యాశాఖాధికారి ఆ ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa