ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల యూనిఫామ్కు సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అడిషనల్ కమిషనర్ (ఐటీ) జారీ చేసిన ఉత్తర్వులు బయటకు వచ్చాయి. జిల్లాలో మండల అధికారులకు కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.. బుధవారం (7-08-2024) నుంచి గ్రామ, వార్డు సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలనే ఆంక్షల్ని ఎవరూ విధించొద్దని ఆదేశించారు. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తలియజేయాలని సూచించారు. ఈ నిబంధన ఆ జిల్లాతో పాటూ మిగిలిన చోట్లా అమలు చేయనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కొత్త ప్రభుత్వానికి కొన్ని రిక్వెస్ట్లు చేశారు. తమకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని.. అలాగే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందుకు రావాల్సిన బకాయిల్ని మంజూరు చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పదోన్నతలు కూడా ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు. అంతేకాదు తమకు అమలు చేస్తున్న యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ వర్తింపజేయాలని కోరారు. కొన్ని సమస్యల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లామని ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే ఈ సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి, సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని రిక్వెస్ట్ చేశారు. అయితే యూనిఫామ్కు సంబంధించి అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగించారు. జులై నెల నుంచి వారితోనే పింఛన్లను ఇంటింటికి పంపిణీ చేయిస్తున్నారు.. ఒక్కొక్కరికి కొన్ని ఇళ్లను మ్యాప్ చేయించి పింఛన్లు పంపిణీ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. గత వైఎస్సార్సీపీ పాలనలో పింఛన్ల పంపిణీని గ్రామ, వార్డు వాలంటీర్లు పంపిణీ చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో .. ఎన్నికల సంఘం వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా పెట్టింది. ఆ తర్వాత పరిణామాలు మారాయి.. వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అలాగే కూటమి ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పింది.. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజీనామా చేసిన వాలంటీర్లు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వాలంటీర్ల వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టమై నిర్ణయాన్ని ప్రకటించలేదు.. వాలంటీర్లను మాత్రం కొనసాగిస్తామని మంత్రులు చెబుతున్నారు. . అయితే వారి సేవలు ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచన చేస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa