జగన్కు ఒకే ఒక్క చాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రం సర్వ నాశనం అయ్యిందని రాష్ట్ర సెర్ప్, ఎన్ఆర్ఐ, చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం గంట్యాడ గ్రామానికి చెందిన పలువు రు మంత్రి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, మద్యం కుంభ కోణం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తిరిగి బాగు చేయాలని సీఎం చంద్రబాబు చూస్తున్నారని, అందుకు ప్రజలందరూ సహ కరించాలని ఆయన కోరారు. ఉద్యోగుల బదిలీలపై స్థానిక నాయకులు అడగవద్దని, సమయం చూసుకుని ప్రభుత్వం జీవో ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్నాయడు, పార్టీ మండల నాయకులు అల్లు విజయకుమార్, రంధి చినరా మునాయుడు, జి.శ్రీనివాస్, బూడి అప్పలనాయుడు, రఘమండ లక్ష్మి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa