రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాలయ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వేతన సవరణను అమలు చేయడంతో పాటు ఉద్యోగులకు మధ్యంతర భృతిని తక్షణమే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసి జిల్లా అధ్యక్షులు ఏ.విద్యాసాగర్ అన్నారు. పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ క్యాలెండర్ను గురువారం ఆటోనగర్ సమీపంలోని ఏపీఐఐసీ జోనల్ కార్యాలయం నందు విద్యాసాగర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాలయ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వేతన సవరణను అమలు చేయడంతో పాటు ఉద్యోగులకు మధ్యంతర భృతిని తక్షణం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించినంత వరకూ అన్ని ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. ఇటీవల 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు అదనంగా పదిశాతం పెన్షన్ను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిణిలకు 6 నెలల మెటర్నరీ లీవు సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నూతన రాష్ట్రంలో నూతన విధానంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల పనిచేస్తున్న పనితీరు రాష్ట్ర ఆదాయానికి అద్దం పట్టే విధంగా ఉందని ఇదే విధానాన్ని మున్ముందు కొనసాగించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను స్వయం సమృద్ధి సంస్థలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. సిపియస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు తీవ్ర ఆందోళనను చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తున్నందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో సిపియస్ విధానం రద్దుపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ.సాంబశివరావు, కార్యదర్శి ఓ.భాస్కరరావు, జాయింట్ సెక్రటరీ రవికాంత్, మహిళా ప్రతినిధిలు యస్.బి.కనకదుర్గ, పద్మావతి, ఏపి ఎన్జీవో అసోసియేషన్ పశ్చిమకృష్ణ సహాధ్యక్షుడు డి.సత్యనారాయణ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి పి.రమేష్, నగర కార్యదర్శి జె.స్వామి, మాజీ అధ్యక్షుడు జి.నారాయణరావు, పలువురు సంఘ నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa