నెల్లూరు టౌన్ హాల్ లో మా తెలుగు ఆచార్యులు శ్రీ పోలూరి హనుమజ్జానకీరామ శర్మ గారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనటం ఆనందదాయకం. ఈ సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. వారి శతజయంతిని శిష్యులందరూ కలిసి ఇలా పండుగల నిర్వహించుకోవటం వారు నాటి సంస్కారం బీజాల ఫలమే.పుంభావ సరస్వతి స్వరూపులైన శ్రీ జానకీరామశర్మ గారు నెల్లూరుకు చెందిన మణిదీపాల్లో ఒకరు. ఎంతో మందికి ప్రాతఃస్మరణీయులైన ఆయన, డిగ్రీ చదివే రోజుల్లో నాకు తెలుగు భాష, సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా చేశారు. శాంత మూర్తి, ఇంద్రియ నిగ్రహం కలవాడు, జ్ఞాన సంపదలో ధనవంతుడు, వినయ వంతుడు, మంచి వేషధారణ కలవారు, పరిశుద్ధుడు, ఆచారవంతుడు, గౌరవనీయుడు, పవిత్రుడు, నిగ్రహానుగ్రహ శక్తి కలవారు అంటూ గురువు ఎలా ఉండాలో పెద్దలు చెప్పిన లక్షణాలకు వారు నిలువెత్తు నిదర్శనం.కుటుంబ విలువలు, గురువు పట్ల గౌరవం వంటివే భారతదేశాన్ని ప్రపంచంలో మహోన్నతంగా నిలబెట్టాయి. ప్రస్తుతం సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యకు భారతీయ విలువలు జోడించి పిల్లలకు నేర్పాలి. మార్కుల కోసం చదువు అనే సంస్కృతి స్థానంలో సంస్కారాన్ని ఒంటపట్టించే విధానాలకు పెద్ద పీట వేయాలి. వసుధైవ కుటుంబక భావన యువతలో పరిఢవిల్లి వికసిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa