శింగనమల నియోజకవర్గం,పుట్లూరు మండలం,ఎ.కొండాపురం గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న పాఠశాల భవనంలోకి వర్షపునీరు చేరడంతో పాఠశాలలోని విద్యార్థుల పుస్తకాలు,పలు రికార్డులు పూర్తిగా తడిసిపోయి ఉండడాన్ని గమనించి,తాత్కాలికంగా విద్యార్థులకు వెంటనే ప్రభుత్వ భవనాల్లో వసతి ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు సూచించారు.2 ఏళ్ల క్రితం కూడా వర్షపు నీటితో పాఠశాల ముంపునకు గురైంది.అయితే అప్పటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల తిరిగి వర్షపు నీరు చేరింది.గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కింద ప్రతిరోజూ ప్రగల్భాలు పలికి,కనీసం స్కూల్ ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడం చేతగాని వైసీపీ ప్రభుత్వమని ఎమ్మెల్యే గారు విమర్శించారు.రాబోయే రోజుల్లో పాఠశాలలోకి వర్షపు నీరు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అలాగే పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు ఉండడానికి గమనించి వీటిలో సంచరించే విషపురుగుల వల్ల పిల్లలకు హాని జరిగితే ఎవరిది బాధ్యత అని అధికారుల మీద ఎమ్మెల్యే గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa