ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్విస్ట్ ఇచ్చిన దువ్వాడ వాణి,,,,నా భర్త ఎలా తిరిగినా పర్లేదు.. కలిసే ఉంటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 07:50 PM

అనూహ్య మలుపులు తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ కథా చిత్రం మరో ట్విస్ట్ తీసుకుంది. ఇన్ని రోజులు దువ్వాడ శ్రీనివాస్ మీద విరుచుకుపడిన ఆయన భార్య దువ్వాడ వాణి.. కాస్త మెట్టుదిగినట్లు కనిపిస్తున్నారు. తనకు రాజకీయాలు,, ఆస్తులు అక్కర్లేదన్న దువ్వాడ వాణి.. తన భర్త తనకు కావాలంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌, తామూ కలిసి అందరం ఒకే ఇంట్లో ఉండటం ముఖ్యమన్నారు. కలిసి ఉండేందుకు గానూ దువ్వాడ శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తామని చెప్పారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు సంబంధం లేదన్న దువ్వాడ వాణి.. కండీషన్లు పెట్టినా అంగీకరిస్తానని చెప్పారు. కుమార్తె పెళ్లి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కూతురి పెళ్లి కోసం, సమాజం కోసం ఒకే ఇంట్లో కలిసి ఉందామని దువ్వాడ శ్రీనివాస్‌ను కోరారు. పిల్లల భవిష్యత్తే తనకు ముఖ్యమన్న వాణి.. దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు అవసరం లేదన్నారు. తన పిల్లల భవిష్యత్తే తనకు ముఖ్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


మరోవైపు ఇంత జరిగిన తర్వాత తన భార్య వాణితో కలిసి ఉండలేనని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. కోర్డులో వాణి కేసులు వేశారన్న దువ్వాడ శ్రీనివాస్.. కోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. రూ..6 కోట్ల విలువైన ఇంటిని, ఫ్యాక్టరీని, రూ.27 కోట్ల ఆస్తిని వాణికి రాసిచ్చినట్లు చెప్పారు, అయితే ఇంటిని మాత్రం రాసివ్వనని స్పష్టం చేశారు. దువ్వాడ వాణి డిమాండ్లకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు గత పది రోజులుగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద వాణి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే నిరసన విరమించాలని పోలీసులు ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నిరసన విరమించాలని నోటీసులు ఇచ్చారు. అయితే తన భర్తకు నోటీసులు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వాలని వాణి స్పష్టం చేస్తున్నారు.


మరోవైపు దువ్వాడ శ్రీనివాస్, వాణి మధ్య రాజీ కుదిర్చేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఎవరూ మెట్టుదిగకపోవటంతో ఈ ఫ్యామిలీ డ్రామాకు తెరపడలేదు. పరస్పరం ఫిర్యాదులు, ఆరోపణలతో ఎంతకూ తగ్గకపోవటంతో దువ్వాడ కుటుంబ వివాదం ముగింపునకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు తన భర్త కావాలని.. ఆయనతో కలిసే ఉంటానంటూ దువ్వాడ వాణి అంగీకరించడం ఆసక్తికరంగా మారింది. తనకు ఆస్తులు, రాజకీయాలేవీ అక్కర్లేదని.. పిల్లల భవిష్యత్తు ముఖ్యమంటూ కలిసి ఉండేందుకు ఆమె ముందుకు రాగా.. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఇక కలిసి ఉండలేమని తేల్చిచెప్తున్నారు. మరి ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందనేదీ చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa