వైసీపీ హయాంలో ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల 2020 భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నమాట వాస్తవం కాదా అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ను మంత్రి నిమ్మల ప్రశ్నించారు. దీనిపై ఐఐటీ హైదరాబాద్ నిపుణులు ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా అంటూ ఆగ్రహించారు. 2014-19మధ్య ఉన్న ఏజెన్సీలను రద్దు చేయడం వల్లే కొత్త ఏజెన్సీ పనులు చేపట్టడానికి 13నెలల సమయం పట్టిందని మంత్రి చెప్పారు. వైసీపీ తీరు వల్ల ఆ 13నెలల సమయమంతా వృథా అయ్యిందని ధ్వజమెత్తారు. ఒకే పనిని రెండు ఏజెన్సీలతో చేయిస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) లేఖ రాయడం నిజం కాదా జగన్ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. ఏజెన్సీలను మార్చడం సరికాదంటూ పీపీఏ మినట్స్లో నమోదు చేసిన విషయం నిజమా.. కాదా?. ఈ ప్రశ్నలన్నింటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ మంత్రి నిమ్మల సవాల్ విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa