నెల్లూరు జిల్లాలో కొంత మంది భారీ లాభాలు ఆశజూపి జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు. బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అసలు వివరాల్లోకి వస్తే.. నెల్లూరులో మనీ స్కీమ్ తరహాలో భారీ మోసం బయటపడింది. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ఓ ట్రస్ట్ ద్వారా కొంతమంది ఏజెంట్లను నియమించుకున్నారు. ఆ ఏజెంట్ల ద్వారా అమాయక ప్రజలకు భారీ లాభాలు ఆశజూపి డిపాజిట్లుగా డబ్బులు వసూలు చేశారు. 500 రూపాయలు కడితే రూ.7 లక్షలు వస్తాయని.. ఆరు వేల రూపాయలు కడితే రూ.18 లక్షలు మీ సొంతమంటూ ప్రచారం చేశారు. దీంతో ఆశకు పోయిన అమాయక జనం.. ఏజెంట్లకు డబ్బులు చెల్లించారు. ఈ రకంగా నెల్లూరు జిల్లాలో దాదాపుగా వేల మంది నుంచి నగదు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం యవ్వారాన్ని చెన్నై కేంద్రంగా నడిచే సంస్థ ద్వారా నడిపినట్లు తెలుస్తోంది.
అయితే డబ్బులు కట్టిన మహిళలు.. ఎప్పుడు చేతికి వస్తుందా అని ఆశగా ఎదురుచూశారు. దీనిపై నిర్వాహకులను ఒకటికి రెండు సార్లు వాకబు చేశారు. అయితే అటువైపు నుంచి స్పందన సరిగా లేకపోవటంతో అనుమానం వచ్చింది. దీంతో డబ్బులు కట్టిన పలువురు ట్రస్టు కార్యాలయానికి చేరుకుని నిర్వాహకులను నిలదీశారు. అక్కడే ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికారులు దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. తమ డబ్బులు వెనక్కి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వ అధికారులు ఎలా స్పందిస్తుందనేదీ చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa