లక్నోలో ఓ వ్యాపారి తన రెండో భార్యను కలిసేందేకు వచ్చి గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓ సిగ్నల్ వద్ద గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యాపారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. గోమతీనగర్లోని అవధ్పురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బీహార్కు చెందిన వ్యాపారవేత్త సతీష్ సోని (39) రెండు వివాహాలు చేసుకున్నాడు.
మొదటి భార్య బీహార్లో ఉంటోంది. కాగా, రెండో భార్య అవధ్పురి, గోమతీనగర్లో నివాసం ఉంటోంది. శనివారం సతీష్ తన రెండో భార్యను కలిసేందుకు ఇంటికి వచ్చాడు. అక్కడ భార్యతో గొడవ పడ్డాడు. గొడవ అనంతరం సతీష్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అవధ్పురి సిగ్నల్ వద్దకు చేరుకుని గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తంతో తడిసి ముద్దయిన సతీష్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనలో సతీష్ భార్యను విచారిస్తున్నట్లు డీసీపీ పూర్వి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa