అదానీని కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, అదానీపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ వారిపై నిస్వార్థంగా పోరాడి, స్వేచ్ఛనే లక్ష్యంగా కాంగ్రెస్ పోరాటం చేసిందని వివరించారు. అలుపెరగని సుదీర్ఘ సమరం చేసి, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిందని చెప్పారు. ఈరోజు, మరోసారి, ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, ప్రజల ఆస్తులను విచక్షణారహితంగా దోచుకుంటున్నకార్పొరేట్ జలగలను తరిమికొడతామని హెచ్చరించారు. వారిని పెంచిపోషిస్తున్న, వారిచేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్తో నడుస్తున్న మోదీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ, దేశం కోసం మరొక పోరాటం సాగిస్తోందని షర్మిల ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa