ఓ ఇంట్లో చోరీ జరిగి బంగారం, నగదు అపహరించుకుపోయిన ఘటన విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలంలో చోటు చేసుకుంది. దీనికి సం బంధించి ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి. మండ లంలోని శ్రీరాంపురంలో నివాసం ఉం టున్న భూమిరెడ్డి ఎర్నాయుడు ఎప్ప టిలా తన కుటుంబం సభ్యులతో కలిసి బుధవారం ఉదయం ఇంటి నుంచి బ యలుదేరి సుమారు 10-30 సమయంలో పొలానికి వెళ్లారు. భార్య దేవి పొలం పనులు ముగించుకుని మధ్యాహ్నం 12-30 సమయానికి ఇంటికి వచ్చి తలుపు తీయగా ఇంటిలో ఉన్న కిటికీలు, తలుపులు, బీరువా తెరిచి ఉన్నాయని గమనించా రు. వెళ్లి చూడగా వరలక్ష్మి వ్రతానికి తెచ్చుకున్న 20 తులాల బంగారు ఆభరణాలు, 20 వేల నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. విజ యనగరం క్లూస్ టీం సీఐ మురళీ, సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. ఘటనపై కే సు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గోపాలరావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa