మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కోల్కతా, బద్లాపూర్లలో జరిగిన ఘటనలపై తీవ్ర ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న వేళ.. మోదీ స్పందించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని హెచ్చరించారు. మహారాష్ట్రలోని లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షపడేలా చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి కోసం ఉన్న కఠిన చట్టాలను మరింత పటిష్ఠం చేస్తామని చెప్పారు.
దేశంలో మహిళల భద్రత ఎంతో ముఖ్యమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళలపై నేరాలు క్షమించరానివని.. ప్రతి రాష్ట్రానికి చెబుతున్నట్లు తెలిపారు. నేరస్థులు ఎవరైనా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్ఠపరుస్తున్నట్లు మోదీ వివరించారు. ఇక 2014 వరకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.25వేల కోట్ల కంటే తక్కువే ఇచ్చారని తెలిపారు. కానీ గత 10 ఏళ్లలోనే రూ.9 లక్షల కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. లఖ్పతి దీదీ కార్యక్రమం కేవలం మహిళల ఆదాయాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్ తరాలను శక్తివంతం చేసేందుకు ఉద్దేశించిందని ప్రధాని మోదీ తెలిపారు. 4.3 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 48 లక్షల మంది లబ్ధిదారుల కోసం రూ.2500 కోట్ల నిధులను ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ విడుదల చేశారు.
ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో మహిళలలది కీలక పాత్ర అని ప్రధాని మోదీ వెల్లడించారు. కుటుంబ శ్రేయస్సు కోసం మహిళగా ఎంతో తోడ్పాటును అందించినా వారికి తగిన సహాయం లభించదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మహిళల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలోని 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని ఎన్నికలకు ముందు తాము హామీ ఇచ్చామని.. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల్లో పనిచేసే వారి వార్షిక ఆదాయం రూ.లక్ష దాటుతుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa