ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపు ఏపీకి ఆక్సిజన్ అని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. కూటమి గెలుపు ఏపీకి ఆక్సిజన్ అందిస్తోందని అన్నారు. 100 రోజుల్లోగానే ఏపీకి కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని, ఐదేళ్లలో జగన్ పర్యటనలతో కలగని ప్రయోజనం.. సీఎం చంద్రబాబు చేపట్టిన 3 పర్యటనల్లో చేకూరిందని అన్నారు. పోలవరానికి నిధుల విడుదల, అమరావతికి నిధుల సహకారం వంటివి ఏపీకి ఎంతో ఉపయోగకరమైన అంశాలే అని అన్నారు. జగన్ కేసుల కోసం ఢిల్లీకి వెళ్తే.. చంద్రబాబు నిధుల కోసం ఢిల్లీ పర్యటనలు చేపడుతున్నారని పేర్కొన్నారు. జగన్ ఢిల్లీ పర్యటనలకు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలకు తేడా ఏంటో ప్రజలకు అర్థమవుతోందని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa