దత్తిరాజేరు మండలంలోని స్టేషన్ బూర్జివలస, చౌదంతివలస గ్రామాల సమీపాన జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఒకరు మృతిచెందిన సోమవారం చో టుచేసుకుంది. స్టేషన్ బూర్జవలస ఎస్ఐ జి.రాజేష్ తెలిపిన వివరాల మేరకు కే.కృష్ణాపురం గ్రామానికి చెందిన సారిక గోవింద(55) వ్యక్తిగత పనుల నిమిత్తం ఆరిక తోట వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బొబ్బిలి నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొంది. ప్రమాదంలో గోవింద తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన క్షత గాత్రుడిని 108లో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. డ్రైవర్ అజాగ్రత్తవల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య రవణమ్మ, వివాహితులైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య రవణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa