ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 07:27 PM

ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించారు. పార్వతీపురం మండలంలోని ఎంఆర్‌నగరం సచివాలయం వద్ద జెమ్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ....  ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ శిబిరంలో వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బోనుదేవి చంద్రమౌళి, గురజాన చంద్రమౌళి, పార్టీ అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు గొట్టాపు వెంకటనాయుడు, సర్పంచ్‌ వంగపండు లక్ష్మి, పార్టీ నాయకులు వంగపండు త్రినాధ్‌నాయుడు, రొంపిల్లి ప్రభాకరరావు, రొంపిల్లి సుభద్రమ్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa