ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయంగా నిలబడిన రేషన్‌ డీలర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 02:26 PM

మేముసైతం అంటూ అనేక మంది స్వచ్ఛందంగా కదలి వరదబాధితులకు సాయం అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నేరుగా వివిధ రూపాల్లో ఆ సాయాన్ని అందజేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు ఊతం ఇచ్చేలా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇతోధికంగా సాయం చేస్తున్న వారూ ఉన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 కోట్లు విరాళంగా అందజేయాలని రేషన్‌ డీలర్లు నిర్ణయించారు. ఈ మేరకు డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుని కలసి తమ అంగీకార పత్రాన్ని అందజేశారు. విజయవాడలోని కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం సీఎం చంద్రబాబును కలసి పలువురు విరాళాల చెక్కులు అందజేశారు.మేఘ ఇంజనీరింగ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్‌ సుబ్బయ్య రూ.5 కోట్లు, రేషన్‌ డీలర్లకు చెందిన రెండు సంఘాలు ఎం. గిరిజారావు తదితరుల నేతృత్వంలో రూ.3 కోట్లు, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గ్రంధి మల్లిఖార్జునరావు చేసిన ప్రకటన మేరకు ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ చల్లా ప్రసన్న, సీఈవో మనోమేరాయ్‌ రూ.2.50 కోట్లు, ఏఐజీ హాస్పటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీ నాగేశ్వరరెడ్డి, వైస్‌ చైర్మన్‌ పీవీఎస్‌ రాజు రూ.కోటి(ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌), వెల్‌జాన్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ అధినేత వెలనాటి జనార్దన్‌రావు రూ.కోటి, లలితా జ్యూవెలరీ మార్ట్‌ లిమిటెడ్‌ అధినేత ఎం కిరణ్‌కుమార్‌ రూ.కోటి, మెప్మా తరఫున ఐఏఎస్‌ అధికారి తేజ్‌ భరత్‌ రూ.కోటి చెక్కు ఇచ్చారు. ప్రసాద్‌ సీడ్స్‌ అధినేత కారుమంచి ప్రసాద్‌ రూ.50 లక్షలు, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సింగపూర్‌ ప్రవాస తెలుగు వారు రూ.17.50 లక్షలు, సిద్ధార్థ మెడికల్‌ కాలేజ్‌ ఓల్డ్‌ స్టూడెంట్‌ డాక్టర్‌ అమ్మన్న రూ.15 లక్షలు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రూ.10 లక్షలు, ఎన్నారైలు సురేష్‌ మానుకొండ, ఉప్పు వినోద్‌బాబు, వరదా అమర్‌ రూ.10 లక్షలు, ఏపీ ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేషన్‌ నుంచి డాక్టర్‌ ఐ బాబ్జీశ్యామ్‌కుమార్‌ రూ.6 లక్షలు, మాలకొండయ్య రూ.5 లక్షలు, బెస్ట్‌ ఆగ్రో లైఫ్‌ లిమిటెడ్‌ యాజమాన్యం సూర్యదేవర బాబు, వెంకట రమాప్రసాద్‌ రూ.5 లక్షలు, వల్లూరి రవీంద్రనాథ్‌, తేజ్‌ రూ.5 లక్షలు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ రూ.5 లక్షలు, ది ఆలమూరు తాలూకా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రూ.5 లక్షలు, మండపేట నియోజకవర్గ రైస్‌ మిల్లర్స్‌ రూ.5 లక్షలు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రూ.1.5 లక్షలు, రోటరీ క్లబ్‌ రూ.75 వేల చెక్కులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అందజేశారు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రూ.4 లక్షలు, టీ సతీష్‌ రూ.3 లక్షలు, పాలడుగు పార్వతీదేవి రూ.3 లక్షలు, ప్రసాద్‌నాయుడు రూ.2 లక్షల 116, టీ కిషోర్‌ కుమార్‌ రూ.1,11,116, గాంధీ-వసుమతి రూ.2 లక్షల 016, కొత్తపల్లి గాంధీ రూ.లక్ష, కేవీఎస్వీ ప్రసాద్‌ రూ.లక్ష, యలమంచిలి విమలాబాయ్‌ రూ.లక్ష, తోటకూర రాజారత్నంబాబు రూ.లక్ష, గారపాటి శ్రీలక్ష్మి రూ.లక్ష, పులి వెంకటేశ్వర్లు రూ.లక్ష, శ్రీ ఇషా రెటీనా ఫౌండేషన్‌ ఐ హాస్పటల్‌ అధినేత కొండా రాజేష్‌ రూ.లక్ష అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa