కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమరావతికి కలిసొస్తోంది.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కనెక్టివీటి మరింత విస్తరించనుంది. కేంద్రం హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే 66ను.. విజయవాడ శివారులో ఉండే గొల్లపూడి వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. గొల్లపూడి దగ్గర నేషనల్ హైవే-65తో అమరావతిని కలిపే.. విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు పూర్తికావడంతో.. విజయవాడ-హైదరాబాద్ హైవే విస్తరణ రాజధాని ప్రాంత అభివృద్ధికి గేమ్ ఛేంజర్గా మారుతుందని భావిస్తున్నారు.
ముందు ఈ హైవేను హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపూర్ నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట వరకు విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే విజయవాడకు జగ్గయ్యపేట దాదాపుగా 100 కిలో మీటర్ల దూరం ఉందని.. కీలకమైన నేషనల్ హైవేను నాలుగు లైన్లతో వదిలేస్తే.. జగ్గయ్యపేట నుంచి గొల్లపూడి వైపు తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అదే ఆరు వరుసలకు విస్తరించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగుతాయన్నారు. అప్పుడు గొల్లపూడి వరకు ఈ విస్తరణ పనుల్ని పొడిగిస్తే బావుంటుందనే నిర్ణయానికి వచ్చారు.
వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతో ఈ అంశంపై చర్చించారు. గొల్లపూడి వరకు హైవేను విస్తరించే అంశాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడాలని సూచించారు. ఇద్దరు కేంద్రమంత్రులు గడ్కరీతో మాట్లాడగా.. గొల్లపూడి వరకు విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్తో కేంద్రం కొత్త రివర్ ఓవర్ బ్రిడ్జి ద్వారా అమరావతిని కలిపే గొల్లపూడి వరకు విస్తరించడానికి కేంద్రం ఓకే చెప్పింది. ఈ మేరకు గొల్లపూడి వరకు డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్రమంత్రి గడ్కరీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల్ని ఆదేశించారు.
తాజాగా గొల్లపూడి వరకు మరో 40 కిలోమీటర్లు (ఆరు లైన్ల విస్తరణకు) పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని డీపీఆర్ తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ హైవే దాదాపు 220 కిలోమీటర్లు పొడవున ఆరు లైన్లగా విస్తరించనున్నారు. తాజాగా టెండర్లను కేంద్రం టెండర్లను ఆహ్వానించింది.. ఈనెల 24వ తేదీని తుది గడువు ఉంంది. అలాగే ఈ హైవేలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్ను గుర్తించి.. రూ.325 కోట్లతో చక్కదిద్దే పనులను ఇటీవల చేపట్టారు. ఈ టెండరులో ఆ పనులను మినహాయించింది కేంద్రం. అంతేకాదు నందిగామ దగ్గర ఉన్న బైపాస్ రోడ్డు పనుల్ని కూడా ఈ టెండర్ నుంచి మినహాయించారు. వాస్తవానికి కేంద్రం విజయవాడ-హైదరాబాద్ హైవేను ఆరు లైన్లగా విస్తరించాలని రెండు దశాబ్దాల క్రితమే ప్లాన్ చేశారు. కానీ ఫస్ట్ ఫేజ్లో నాలుగు లైన్లకే పరిమితం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa