మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికు ఏపీ మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో జగన్ విఫలం అయ్యారని అరోపించారు. ఈ మేరకు (X) ట్విట్టర్ లో మాజీ సీఎం జగన్, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.‘‘ఏం చదివావో తెలియదు.. ఎక్కడ చదివావో అస్సలు తెలియదు.. నువ్వు విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది. ఫేక్ జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం.. మీరు తీసుకున్న నిర్ణయాలతో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడంతో పదోతరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది’’ అని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సీబీఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయాల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంసమామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. మీరు అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సెలవివ్వండి’’ అని నారా లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa