వేంపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న వృశభాచలేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూములను ఆక్రమణ దారుల నుంచి కాపాడాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం దేవస్థాన ఈవో విశ్వనాథరెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. దేవస్థానానికి సంబంధించి 70 సెంట్ల స్థలం ఉందని, దాని విలువ రూ. కోట్లు ఉంటుందని తెలిపారు. ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa