ఆగి ఉన్న బోలెరో చేపల వ్యాన్ను బైక్ తో వచ్చి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇరువురు అక్కడిక్కడే మృ త్యువాత పడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద జాతీయరహదారిపై మంగళవారం రావులపాలెం నుంచి పాత బ్రిడ్జి మీదుగా వస్తున్న మత్స్యకారుల చేప ల వ్యాన్ ఏటిగట్టు నుంచి కపిలేశ్వరపురం వెళ్లేందుకు ఆగుతుండగా అదే దారిలో బైక్ వస్తున్న ఆలమూరు మండలం చొప్పెల్లకు చెందిన వానపల్లి రాజేష్(30), కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన వేగిరాజు సీతారామరాజు(36) ఆగుతున్న వ్యాన్ను గుర్తించకపోవడంతో వెనుక నుంచి బలంగా ఢీకొన్నారు. దీంతో వారు ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇంత భారీ ప్రమాదం జరిగి ఇరువురు మృతి చెందిన వారిలో ఒకరికి కూడా కనీసం గాయం కాకుండా మృత్యువాత పడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వెల్డింగ్ సామాన్లు కొనుగోలు చేయడానికి రావులపాలెం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువుల ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్ఐ ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa