తన రాజకీయ ప్రయాణం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే అని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్నివైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఖండించారు.. తాను జనసేనలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తన అభిమానులకు సూచించారు.. ప్రస్తుతం తాను ఆరోగ్యరీత్యా హైదరాబాద్లో ఉన్నానని.. త్వరలోనే అందరినీ కలుస్తానని ప్రకటించారు. ఈ మేరకు దాడిశెట్టి రాజా వాట్సాప్లో పోస్టు చేశారు. ”వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు.. నేను తునిలో లేని సమయంలో నేను జనసేన వైపు చూస్తున్నట్టు ఫేక్ న్యూస్ సృష్టించారు.. ఆ ఫేక్ న్యూస్ మా పార్టీ నాయకులు, కార్యకర్తల మనస్సు నొప్పించాయి.. ఇలాంటి కథనాలతో అపోహలు కల్పించాలని చూస్తున్నారు.
అయితే, మొదటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని తన వెన్నంటే ఉండి.. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగానూ.. అధికారపక్షంలో మంత్రిగానూ నా ఉన్నతికి సహకరించిన మిమ్మల్ని గానీ.. మన నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కానీ వీడి వెళతానని.. ఎవ్వరు చెప్పినా నమ్మవద్దు.. అనారోగ్యం రీత్యా టెస్ట్ల కోసం హైదరాబాద్లో ఉన్నారు.. తుని వచ్చిన వెంటనే అందరినీ కలుస్తాను అంటూ.. వైయస్ఆర్సీపీ తుని వాట్సాప్ గ్రూప్లో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఓ పోస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa