గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతి లెక్కలు బయటకు తీస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఎర్రనేల కొట్టాల, మారుతీనగర్లో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు ఏకష్టం లేకుండా చేయడమే లక్ష్యమన్నారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం తప్పించుకోలేరన్నారు. డంపింగ్ యార్డు అవినీతిపై జేసీతో విచా రణకు ఆదేశించామని, పనిముట్ల వ్యవహారం ఫిర్యాదులపై విచారణ చేయిస్తామన్నారు. కూటమి ప్రభు త్వం మైనార్టీల పక్షపాతి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ నాగరాజు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్మొద్దీన, తలారి ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, గాజుల ఆదెన్న, గోళ్ల సుధాకర్ నాయుడు, పోతుల లక్ష్మీనరసింహులు, రాజారావు, పీఎం లక్ష్మీప్రసాద్, లక్ష్మీనరసింహ, నెట్టెం బాలకృష్ణ, బాబాఫకృద్దీన, రంగాచారి, సీసాల శ్రీనివాసులు, కొండవీటి భావన, స్వప్న, బల్లా పల్లవి, రహమత బీ, సంగా తేజస్విని, జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa